బ్రిడ్జి పనుల్లో నాణ్యత పాటించాలి : కలెక్టర్

by Disha Web Desk 20 |
బ్రిడ్జి పనుల్లో నాణ్యత పాటించాలి : కలెక్టర్
X

దిశ, కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పట్టణంలోని అందేవెల్లి బ్రిడ్జి పనుల్లో నాణ్యత పాటించాలని కొమురం భీం జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ అన్నారు. సోమవారం రెవెన్యూ, అర్ అండ్ బీ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి అవతలి వైపు ఉన్న మండల, గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు సౌకర్యం ఉంటుందని వివరాలు సేకరించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబందించిన పలు అంశాలను మ్యాప్ లో కలెక్టర్ కు వివరించారు.

ప్రతిరోజు బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద ఎంతమంది కూలీలు పనులు చేస్తున్నారని. బ్రిడ్జి వద్ద కూలీలు జాగ్రత్తగా పనులు నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ సమాచారాన్ని తెలియజేయాలని అధికారులకు సూచనలు చేశారు. పనుల వేగాన్ని పెంచి వర్షాకాలానికి ముందుగానే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిచేసే దిశగా గుత్తేదారు పనులు చేపట్టాలని. బ్రిడ్జి నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లగించకుండా పనులు చేపట్టాలని తెలిపారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ ప్రమోద్, ఆర్ ఐ ఖలీల్, ఆర్ అండ్ బీ అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story