ఆంక్షలు లేకుండా పంటలను కొనుగోలు చేయాలి : రైతులు

by Ratna Kumari |

దిశ, బోథ్ : మండలం లో అకాల వర్షాల వలన పత్తి పంట పూర్తిగా తడిసి పోయి తేమ అధికంగా ఉండడం తో ఎటువంటి ఆంక్షలు లేకుండా పంటను కొనుగోలు చేయాలని రైతులు తెలిపారు. శుక్రవారం విలేకరుల స

ఆంక్షలు లేకుండా పంటలను కొనుగోలు చేయాలి : రైతులు
X

దిశ, బోథ్ : మండలం లో అకాల వర్షాల వలన పత్తి పంట పూర్తిగా తడిసి పోయి తేమ అధికంగా ఉండడం తో ఎటువంటి ఆంక్షలు లేకుండా పంటను కొనుగోలు చేయాలని రైతులు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. వర్షాల వ‌ల్ల‌ పత్తి పంట తడిసిపోయి తేమ అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వమే రైతులను ఆదరించి 20% తేమ ఉన్నా మద్దతు ధరకే సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టాలని లేని యెడల రైతులు అంతా సంఘటితం అయి ఉద్యమిస్తామని అన్నారు. అదేవిధంగా సోయాబీన్, మొక్కజొన్న పంటలు వర్షాల వలన మార్కెట్ యార్డులో తడిసిపోయి రంగు మారిపోయాయి వాటిని కూడా ప్రభుత్వమే ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరారు.

Next Story