త్వరలోనే విచారణ చేపడతాం.. కలెక్టర్ వరుణ్ రెడ్డి..

by Disha Web Desk 20 |
త్వరలోనే విచారణ చేపడతాం.. కలెక్టర్ వరుణ్ రెడ్డి..
X

దిశ, నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన అభియోగాల పై స్థానిక ఇంచార్జి డీపీఆర్ఓ తిరుమల పై త్వరలోనే విచారణ చేపడతామని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుకు స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరలోనే విచారణ చేపడతామని, నిజం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, ఉపాధ్యక్షులు అశోక్, వేణుగోపాల్, జిల్లా కోశాధికారి వాకులాభరణం, ప్రశాంత్, సహాయ కార్యదర్శులు రషీద్ ఆలం, సట్ల హన్నాండ్లు, సోషల్ మీడియా ఇంచార్జి యోగేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు అమీన్ పటేల్, గపూర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed