ఎలుగుబంటి ఉంది.. భ‌ద్రం..!

by Ratna Kumari |

బోథ్ ప్రాంత అడవులలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అటవీ క్షేత్ర అధికారి టి ప్రణయ్ బుధవారం తెలిపారు.

ఎలుగుబంటి ఉంది.. భ‌ద్రం..!
X

దిశ‌, నేర‌డిగొండ : బోథ్ ప్రాంత అడవులలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అటవీ క్షేత్ర అధికారి టి ప్రణయ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాత్రి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర కు చెందిన పలువురిపై ఎలుగుబంటి దాడి చేసినట్టు వెల్ల‌డించారు. దీంతో పలువురు తీవ్ర గాయాలైనట్లుగా అక్కడ అధికారులతో సమాచారం ఉన్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా బోథ్ అటవీ ప్రాంతంలోకి ఆ ఎలుగుబంటి ప్రవేశించిన‌ట్టు స‌మాచారం. అడవికి సమీపాన ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవిలోకి ఎవరు వెళ్ళవద్దని కోరారు.

Next Story