ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి: ఎమ్మెల్యే రేఖ శ్యాంనాయక్

by Disha Web Desk 1 |
ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి: ఎమ్మెల్యే రేఖ శ్యాంనాయక్
X

దిశ ఖానాపూర్: ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యాంనాయక్ హెచ్చరించారు. పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు బీజేపీ ముఖ్య నాయకులు తన అనుచరులను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ, పది పరీక్షా పత్రాలను బీజేపీ నాయకులే లీక్ చేశారని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్ని నాటకాలు ఆడినా.. రాబోయే ఎన్నికల్లో అతడికి, ఆ పార్టీకి బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే రేఖ శ్యాంనాయక్ హెచ్చరించారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలను నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చలగాటమాడితే వారు ఎంతటి వారైనా ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తల్లపెల్లి రాజగంగన్న, పుప్పాల శంకర్, శనిగారపు శ్రవణ్, బీఆర్ఎస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story