దిశ వార్త ఫుల్ వైరల్.. స్పందించిన బండి సంజయ్

by Dishanational2 |
దిశ వార్త ఫుల్ వైరల్.. స్పందించిన బండి సంజయ్
X

దిశ, భైంసా : భైంసా పట్టణానికి చెందినటువంటి గంగా ప్రసాద్ వివాహం ఈనెల 24న జరగనుంది. బంధువులకి, స్నేహితులకి,సన్నితులకు పంచే శుభలేఖలలో అభిమానంతో మోడీ,బండి సంజయ్ ఫోటోలను ముద్రించారు. ఇట్టి వార్తని మొదట దిశ పత్రిక,దిశ ఛానెల్ ప్రచురించగా సామాజిక మాధ్యమాలలో ఫుల్ వైరల్ అయ్యింది.తర్వాత పలు పత్రికలు,చానల్స్ ఈ వార్తా ను ప్రచురించగా.. ఎట్టకేలకు ఈ వార్త రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండిసంజయ్ వద్ద చేరగా, గంగా ప్రసాద్ కి కాల్ చేసి మీ అభిమానానికి కృతజ్ఞతలు, వీలుంటే పెండ్లికి వస్తా..! కుదరకపోతే బైంసా వచ్చినప్పుడు మీ నివాసంలో భోజనం చేస్తానని తెలిపారు. తన అభిమానాన్ని గుర్తించి రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్ నుండి ఫోన్ రావడంతో గంగాప్రసాద్ ఆనందపడ్డాడు.ఈ వార్తని మొదటగా ప్రచురించిన దిశపత్రికకి ,బైంసా దిశ ప్రతినిధికి గంగప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story