అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

by Disha Web Desk 20 |
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..
X

దిశ, సోన్ : మండలంలోని బొప్పారం గ్రామ శివారులో గల సంగం పేట్ గుట్టపై అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మంగళవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సంఘం పేట్ గ్రామానికి చెందిన కుమారపు సాయికుమార్ (22) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని తెలిపారు.

హోలీ సంబరాల్లో భాగంగా నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామానికి చెందిన యువకులతో పాటు సంఘంపేట గ్రామానికి చెందిన యువకులు రాత్రి గొడవకు దిగారన్నారు. ఈ గొడవలో భాగంగా అక్కడికి వెళ్లిన సాయి కుమార్ కుప్పకూలిపోయాడన్నారు. ఘర్షణలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదని తెలిపారు. ఈ మేరకు సొన్ ఎస్సై సంతోషం రవీందర్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story