విషం కలిపిన బీరు తాగి యువకుడి మృతి

by Disha Web Desk 1 |
విషం కలిపిన బీరు తాగి యువకుడి మృతి
X

దిశ, లక్షెట్టిపేట: విషం కలిపిన బీరు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మున్సిపాలిటీ పరిధి మోదెల శివారులోని ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్( 22) అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామైన దారంగుల రాజమౌళి కూతురుని ప్రేమిస్తున్నాడు. అది ఇష్టం లేని మేనమామ ఈనెల 15న అనిల్ ను బెదిరించాడు.

దీంతో అనిల్ పాయిజన్ కలిపిన బీరు తాగాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. అనిల్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మోదెల శివారులోని టేకు చెట్ల వద్దకు తీసుకువెళ్లి బీరులో విషం కలిపి బలవంతంగా ఎవరైనా తాగించారా.. లేక మనస్తాపానికి గురై అనిల్ బీరులో విషం కలుపుకుని తాగాడా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

కాగా, టేకు చెట్ల వద్దకు తీసుకువెళ్లి మెడపై కత్తి పెట్టి తనకు బలంవంతంగా విషం కలిపిన బీరును తాగించారని మృతుడు తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

Next Story

Most Viewed