కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన యువకుడు ఏమయ్యాడో తెలుసా..

by Disha Web Desk 20 |
కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన యువకుడు ఏమయ్యాడో తెలుసా..
X

దిశ, జన్నారం : కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మృతి చెందాడు. ఈ విషాదకరసంఘటన జన్నారం మండలంలోని ఇందన్ పెల్లి గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి తనతోటి మిత్రులు చెప్పిన వివరాలు చూస్తే సోహేల్ జగిత్యాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఎండీ సోహేల్ (18) ఇందన్ పల్లిలోని తన పెద్దమ్మ ఇంటికి వచ్చాడు.

మంగళవారం ఉదయం తన తోటి మిత్రులతో కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి కడెం కెనాల్ వద్దకు వెళ్ళారు. ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి కొట్టుకు పోయాడన్నారు. తోటి మిత్రులు చూసి చుట్టు ప్రక్కల వారికి తెలుపడంతో వెంటనే కొంత మంది ఈతగాల్లు కాలువలో దూకి సోహెల్ ను వెతికారు. అప్పటికే సోహెల్ మృతి చెంది విగతజీవిగా వారికి దొరికాడు.



Next Story

Most Viewed