Breaking News : పోలీసుల ముందు లొంగిపోయిన లగచర్ల కేసు నిందితుడు

by Muthe.Rajitha |

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla) ఘటన గురించి తెలిసిందే.

Breaking News : పోలీసుల ముందు లొంగిపోయిన లగచర్ల కేసు నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla) ఘటన గురించి తెలిసిందే. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై లగచర్ల, రోటిబండ గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. కాగా ఈ కేసులో ఏ2(A2) నిందితుడిగా ఉన్న సురేష్(Suresh) నేడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దాడి జరిగిన రోజు నుంచి సురేష్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనూహ్యంగా నేడు వికారాబాద్ పోలీసుల ఎదుట సురేష్ స్వయంగా లొంగిపోయాడు. దీంతో పోలీసులు సురేష్ ను కోడంగల్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

Next Story