మరోసారి పంజా విసిరిన ACB.. మాజీ ENC మురళీధర్ రావు ఇంట్లో సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-15 04:12:42  IST  )

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు.

మరోసారి పంజా విసిరిన ACB.. మాజీ ENC మురళీధర్ రావు ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులు ఇవాల ఉదయం నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రిటైర్డ్ మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు కరీంనగర్, జహీరాబాద్‌, నిజామాబాద్‌లలో మొత్తం 10 చోట్ల బంధువులు, స్నేహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడున్నారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా మురళీధర్ రావు విధులు నిర్వర్తించారు. అనంతరం పదవీ విరమణ చేయగా.. ఆయన సేవలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 13 ఏళ్ల పాటు పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లవెత్తిన క్రమంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మురళీధర్ రావును రాజీనామా చేయాలని చెప్పడంతో పదవి నుంచ వైదొలిగారు. అయితే, అన్ని ప్రాంతాల్లో సోదాలు ముగిసిన వెంటనే అధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Next Story