JNTUH లో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

by Disha Web Desk 11 |
JNTUH లో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​పరిధిలోని JNTUH లో బీటెక్​ కంప్యూటర్​ సైన్స్​ అండ్​ ఇంజనీరింగ్​ నాలుగవ సంవత్సరం చదువుతున్న ఎసానక మేఘన(21), బుధవారం వర్సిటిలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్​బీ సీఐ కిషన్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా మేఘన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, దీంతో మనస్తాపానికి గురైన మేఘన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. నెల్లూరుకు చెందిన ఈ మనోజ్​కుమార్​రెడ్డి కుటుంబం గత కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూకట్​పల్లిలోని వివేకానందనగర్​ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా మానసిక నిపుణుల వద్ద వైద్యం చేయించుకుంటుంది. కాగా మేఘన తన అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది బుధవారం మూడవ అంతస్థులో ఉన్న తన క్లాస్​ రూం బాల్కాని నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన మేఘనను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మేఘన మృతి చెందినట్లు సీఐ కిషన్​కుమార్​ తెలిపారు.


Next Story