పదో తరగతి విద్యార్థులకు BIG అలర్ట్.. విద్యాశాఖ కీలక నిర్ణయం

by Disha Web Desk 2 |
పదో తరగతి విద్యార్థులకు BIG అలర్ట్.. విద్యాశాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాపీయింగ్ నిర్వహణపై ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లు రాయాలని తెలిపింది. ఇలా చేస్తే ప్రశ్నా పత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని పేర్కొంది. కాపీయింగ్‌కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని.

ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రచారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఇటీవలే టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం కాస్త ఉపశమనం ఇచ్చే వార్త చెప్పిన సంగతి తెలిపిందే. కొంతకాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5 నిమిషాల గ్రేస్ టైమిచ్చింది. కాగా, మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.


Next Story

Most Viewed