ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు గాయాలు

by Disha Web Desk 2 |
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండలోని హసన్‌పర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, గాయాలపాలైన వారి సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed