నేడు గవర్నర్‌‌ను కలవనున్న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం

by Sathputhe Rajesh |

నేడు రాజ్ భవన్ లో గవర్నర్ ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలవనుంది.

నేడు గవర్నర్‌‌ను కలవనున్న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలవనుంది. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత ఎంపిక తీర్మానాన్ని గవర్నర్‌కు కాంగ్రెస్ బృందం ఇవ్వనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కోరనున్నారు. ఇక, ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ప్రకటించగా రేపు తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. దీంతో పాటు మంత్రి వర్గ కూర్పుపై చర్చిస్తున్నారు.

Next Story