- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
83 మంది ఎస్సైల బదిలీలు.. చనిపోయిన ఎస్సైకి పోస్టింగ్
by Javid Pasha |
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీల పర్వం కొనసాగుతోంది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఏసీపీ, సీఐలను బదిలీ చేసిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తాజాగా గురువారం 83 మంది సబ్ ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఎస్సైల పనితీరుపై పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుని విశ్లేశించిన తర్వాత బదిలీలు చేసినట్టుగా సమాచారం.
అయితే, ఈ బదిలీల్లో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కనిపించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ ఇటీవల గుండెపోటుతో చనిపోయిన ప్రభాకర్ రెడ్డిని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై పోలీస్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Next Story






