Sabarimala special trains : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

by Ramesh Naini |   (  Updated:2024-11-15 10:02:33  IST  )

అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Sabarimala special trains : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను కోరింది.

ఈ నెల 22,29 తేదీల్లో మౌలాలి-కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1 వ తేదీల్లో కొల్లాం-మౌలాలి, ఈ నెల 18,25 మచిలీపట్నం-కొల్లాం, ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) వివిధ గమ్యస్థానాల మధ్య 26 శబరిమల ప్రత్యేక రైళ్లను ఇది వరకే ప్రకటిచిన విషయం తెలిసిందే.

Next Story