53 మంది ఎంపీడీవోలు బదిలీ.. పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |

మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDO)లను 53 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది.

53 మంది ఎంపీడీవోలు బదిలీ.. పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDO)లను 53 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎన్నికలకు ముందు నిబంధనల్లో భాగంగా వివిధ జిల్లాలకు ఎంపీడీవోలను బదిలీ చేశారు. ఎన్నికల తర్వాత తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని వారు రికెస్ట్ చేయగా.. ప్రభుత్వం అంగీకరించడంతో ఎంపీడీవోలను బదిలీ చేశారు. మల్టీ జోన్-1లో 31 మంది, మల్టీ జోన్-2లో 22 మంది ఎంపీడీవోలను బదిలీ అయ్యారు. త్వరలో మరికొందరు కూడా బదిలీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story