TSPSC పేపర్ లీక్ కేసు: మరో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్

by Disha Web Desk 19 |
TSPSC పేపర్ లీక్ కేసు: మరో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్​అధికారులు మంగళవారం మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 28కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్​కుమార్​బ్యాంక్​అకౌంట్ల ద్వారా వెల్లడవుతున్న వివరాల ఆధారంగా సిట్​అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో నలుగురు కూడా ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​ప్రశ్నాపత్రాలు కొన్నట్టుగా దర్యాప్తులో తేలిన నేపథ్యంలో మంగళవారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని ప్రవీణ్​కుమార్​ప్రశ్నాపత్రాలు అమ్మినట్టుగా దర్యాప్తులో తేలింది.

Next Story