సోషల్‌ మీడియాలో ఎన్‍కౌంటరైన మావోయిస్టుల సాంగ్స్ వైరల్

by Prasad Jukanti |   (  Updated:2026-03-11 14:53:24  IST  )

ఆపరేషన్ కగార్‌తో మావోయిజం ముగింపు దశకు చేరుతుండగా హతమైన మావోయిస్టు నేతల ఫోటోలు, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో ఎన్‍కౌంటరైన మావోయిస్టుల సాంగ్స్ వైరల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో ఆరు దశాబ్దాల పాటు సాయుధపోరాటంతో మార్పు తీసుకువస్తామని నిర్విరామంగా సాగించిన మావోయిస్టుల పోరాటం చారిత్రాత్మక ముంగింపు దశకు చేరుకుంది. ఆపరేషన్ కగారు పేరుతో భద్రతాదళాలు మావోయిస్టులపై విరుచుకుపోడుతున్నాయి. 20026 మార్చి 31 లోపు దేశాన్ని మావోయిజం రహిత దేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించుకుని ఆపరేషన్ కొనసాగిస్తుంటే మరో వైపు ఈ ఆపరేషన్‍లో ఎన్‍కౌంటర్ అయిన మావోయిస్టులకు సంబంధించిన ఫోటోలు, పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన మడావి హిడ్మా, ఆయన భార్య రాజే, చలపతి, గణేశ్, హన్మంతు వంటి ముఖ్య నేతల ఫోటోకు పాటల క్లిప్పింగ్ లు వైరల్‍గా మారుతున్నాయి.

పోలీసులు హెచ్చరించినా?:

మారేడుమిల్లి అడవుల్లో గతేడాది నవంబర్ లో ఏపీ పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు పార్టీ గెరిల్లా దాడి వ్యూహకర్త మడావి హిడ్మా ఆయన భార్య రాజే ఫోటోలు పెద్ద ట్రెండ్ అవుతున్నాయి. హిడ్మా, రాజేలు ఇద్దరు కలిసి అడవుల్లో ఉన్నట్లు, వారు గిరిజనులతో మాట్లాడుతూ వారికి జంగల్ రక్షించుకోవడానికి శిక్షణ ఇస్తున్నట్లు ఏఐ తో క్రియేట్ చేసిన వీడియోలకు సినిమా పాటలు, డైలాగులు జోడించి వైరల్ చేస్తున్నారు. కాగా గత నెలలో ఛత్తీస్‍గఢ్‍లోని బస్తర్ జిల్లా (Bastar) జగదల్ పూర్‍లో జరిగిన భూంకాల్ 116 వార్షికోత్సవం ర్యాలీలో ఆయన పేరుతో సాగే ఓ పాట డీజే వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ ర్యాలీలో హిడ్మా పేరుతో ఉన్న ఓ డీజే వెర్షన్ పాటను స్పీకర్లలో ప్లే చేశారు. ఇలాంటి పాటలపై అప్పట్లో పోలీసులు సైతం యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. కానీ హతమైన మావోయిస్టులకు సంబంధించిన ఫోటోలకు పాటలు జోడించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.

స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ‘మఖ్దూం భవన్’ వైపు మాజీ మావోయిస్టుల అడుగులు!

Next Story