చావుబతుకుల్లో ఉద్యమనాయకుడు.. సాయం కోసం ఎదురుచూపు..

by  |
చావుబతుకుల్లో ఉద్యమనాయకుడు.. సాయం కోసం ఎదురుచూపు..
X

దిశ,కేయూ క్యాంపస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు దబ్బేట మహేష్. ప్రస్తుతం కరోనా బారిన పడి వరంగల్ ఎంజీఎంలో మెరుగైన వైద్యానికి నోచుకోలేక పోతున్నాడు. తనపై ఎన్నో కేసులు నమోదు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రమే తన ఊపిరిగా ఉద్యమించి రాష్ట్రం సాధించడంలో కీకల పాత్ర పోషించాడు.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం ఉద్యోగస్తుడుగా కొనసాగుతున్నాడు. చాలి చాలని జీతాలతో తన జీవినాన్ని నెట్టుకొస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కోవిడ్ బారిన పడిన దబ్బేట మహేశ్ కి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed