మరి కాసేపట్లో నల్గొండ సెగ్మెంట్ 3వ రౌండ్ ఫలితాలు.. సమానంగా పోలవుతున్న చెల్లని ఓట్లు

by  |
మరి కాసేపట్లో నల్గొండ సెగ్మెంట్ 3వ రౌండ్ ఫలితాలు.. సమానంగా పోలవుతున్న చెల్లని ఓట్లు
X

దిశ,వెబ్‌డెస్క్: మరి కాసేపట్లో నల్గొండ – ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రౌండ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు లక్షా 11,994 ఓట్ల లెక్కింపు పూర్తి కాగా అందులో చెల్లని ఓట్లు 6,160 ఉన్నాయి. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి 31,987, నవీన్ (తీన్మార్ మల్లన్న) 24,116, కోందడరామ్ 18,528, బీజేపీ 13,824 పోలయ్యాయి. ప్రస్తుతం 7,871 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు.

మరోవైపు రౌండ్ రౌండ్ కు అభ్యర్ధులకు పోలైన ఓట్లతో పాటూ చెల్లని ఓట్లు సమానంగా నమోదవ్వడం చర్చాంశనీయంగా మారింది. ఇలాగే కొనసాగితే కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story