కృష్ణ బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ

by  |
కృష్ణ బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. GNSS పనులను నిలిపివేయాలని కేఆర్‌ఎంబీకి లేఖ పంపారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏపీ సర్కార్ జిల్లేడుబండ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లకు సిద్ధమైందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. గతంలో జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు విస్తరణకు అనుమతించొద్దని లేఖలు రాశామని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ జీఎన్‌ఎస్‌ఎస్ విస్తరణ పనులు చేపట్టారని లేఖలో పేర్కొన్నారు.


Next Story