- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హైసియా ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో బ్రాండ్ హైదరాబాద్ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మా విధానాల ద్వారానే యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వచ్చాయని, ఐటీ, లైఫ్ సైన్సెస్లో తెలంగాణ లీడర్గా ఉంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఈ వెహికల్స్, టెక్స్ టైల్స్, లాజిస్టిక్ సెక్టార్ వంటి రంగాల్లో పురోగతిని సాధిస్తున్నామని, హైదరాబాద్లో ఎస్ఆర్డీపీ కింద సమగ్ర రోడ్డు మేనేజ్మెంట్ ప్రోగ్రాం చేస్తున్నట్లు వెల్లడించారు.
రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనలో ముందున్నామని, మురుగు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచినట్లు మంత్రి చెప్పారు. 1916 నాటి వర్షాలు మళ్లీ రావడంతో నాలాలు పొంగిపొర్లాయని, అందుకే ఇప్పుడు ఎస్ఎన్డీపీ కింద నాలాల శుద్ధీకరణ చేపడుతామన్నారు. కొందరు ఎన్నికల కోసం విద్వేషాలను రేకెత్తించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.