అపోలో ఆస్పత్రిలో చేరిన హోంమంత్రి!

by  |
అపోలో ఆస్పత్రిలో చేరిన హోంమంత్రి!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గత వారం రోజుల నుంచి ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనను ముందుజాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చించినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆయన వ్యక్తిగత పీఏకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed