జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దు.. హైకోర్టులో సీబీఐ వాదనలు

by  |
jagan
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వవద్దని తెలంగాణకు హైకోర్టును సీబీఐ కోరింది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో నిరాకరించినట్లు సీబీఐ వాదించింది.

జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశముందని, పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని పేర్కొంది. హాజరు మినహాయిస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని తెలిపింది. జగన్ హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.



Next Story