రాష్ట్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు..

by  |
రాష్ట్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలకు ప్రజానీకం అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో వరదలు పెద్ద ఎత్తున పొటెత్తడంతో పశుపక్షాదులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల ఎకరాల్లో పంట నీటమునిగినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది.

ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో 040-23450624 నెంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, అన్ని జిల్లాల్లో 24గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు.

Next Story

Most Viewed