ఆత్మ నిర్భర్ ఓ ఆశా భంగం

by  |
ఆత్మ నిర్భర్ ఓ ఆశా భంగం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ ప్యాకేజీ వలస కార్మికులకు ఆశా భంగాన్ని కలిగించిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ అన్నారు. వలస కార్మికులను తక్షణమే ఆదుకోకాపోతే ఉత్పత్తిరంగాలు దెబ్బతినే పరిస్థితి ఉందని, ఇలాంటి ప్యాకేజీలు ఎన్ని కేటాయించిన లాభం ఉండదని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జి నిరంజన్ మాట్లాడారు. దేశంలో 10శాతం ఉన్న వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు షెల్టర్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.11వేల కోట్లు విడుదల చేశామని చెప్పిన ఆర్థిక మంత్రి ఎన్ని షెల్టర్లు ఏర్పాటు చేశారో సమాధానం చెప్పలేక పోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు.



Next Story

Most Viewed