నేడు పీవీ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీల నివాళ్లు

by  |
నేడు పీవీ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీల నివాళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవిఘాట్ వద్ద తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12:45 నిమిషాలకు పీవీ జ్ఞన ఘట్ భూమి వద్ద బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావులు పాల్గొననున్నారు. అదేవిధంగా దేశంలో నూతన నూతన ఆర్థిక విధానాల తీసుకొచ్చిన పూర్వ ప్రధాని పీవి. నరసింహారావు సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచే విధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలు… 2021 జూన్ 28 వరకూ కొనసాగనున్నాయి.


Next Story

Most Viewed