ఈసీని కలిసిన బీజేపీ నేతలు.. ఎందుకంటే !

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర పోలీసు బలగాలను రప్పించి జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌ అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులు ఉండొద్దని ఎన్నికల కమిషన్‌కు విన్నవించినట్టు తెలిపారు. మున్సిపల్ అధికారులెవ్వరూ ఎన్నికల బాధ్యతల్లో ఉండరాదని, ప్రిసైడింగ్ అధికారులను స్థానికేతరులను నియమించాలని కోరినట్టు వెల్లడించారు. మునిసిపల్ అధికారులు ఓటర్ల జాబితాలో [&hellip;]</p>

ఈసీని కలిసిన బీజేపీ నేతలు.. ఎందుకంటే !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర పోలీసు బలగాలను రప్పించి జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌ అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులు ఉండొద్దని ఎన్నికల కమిషన్‌కు విన్నవించినట్టు తెలిపారు. మున్సిపల్ అధికారులెవ్వరూ ఎన్నికల బాధ్యతల్లో ఉండరాదని, ప్రిసైడింగ్ అధికారులను స్థానికేతరులను నియమించాలని కోరినట్టు వెల్లడించారు. మునిసిపల్ అధికారులు ఓటర్ల జాబితాలో చాలా పొరపాట్లు చేశారని, ఓటర్లను తొలగించడం, తగ్గించడం చేశారని చనిపోయిన వారి పేర్లను సైతం లిస్టులో చేర్చారన్నారు.

Next Story