నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

by  |
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళ సై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావ్ గురువారం రోజున అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. అయితే కరోనా నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ రిపోర్టును కలిగి ఉండాలి. ఈ సారి సమావేశాలకు సందర్శకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.


Next Story