1500 ఏళ్ల క్రితం మరణించిన రాజు.. DNA సాయంతో ముఖాన్ని రివీల్ చేసిన శాస్త్రవేత్తలు

by Disha Web Desk 20 |
1500 ఏళ్ల క్రితం మరణించిన రాజు.. DNA సాయంతో ముఖాన్ని రివీల్ చేసిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : 1500 ఏళ్ల క్రితం చైనాను ఏలిన పాలకుడి గురించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనీస్ రాజు DNA సహాయంతో, శాస్త్రవేత్తలు అతని ముఖాన్ని, మరణానికి కారణాన్ని ఊహించారు. కరెంట్ బయాలజీ జర్నల్‌లో బుధవారం (మార్చి 28) ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, చక్రవర్తి వు చైనా ఉత్తర జౌ రాజవంశాన్ని 560 AD నుండి 578 AD వరకు పాలించాడు. కొత్త నివేదిక ప్రకారం వు బహుశా బలమైన సైన్యాన్ని నిర్మించడం, టర్క్‌లను తప్పించుకోవడం, ఉత్తర క్వి రాజవంశాన్ని ఓడించిన తర్వాత ఉత్తర చైనాను ఏకం చేయడం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.

వూ చక్రవర్తి కేవలం 36 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అయితే ఇంత చిన్న వయసులోనే చక్రవర్తి చనిపోవడానికి గల కారణం చాలా కాలంగా చర్చనీయాంశమైంది. కొంతమంది చరిత్రకారులు అతను ప్రత్యర్థులచే విషం తీసుకున్నారని నమ్ముతారు. మరికొందరు అతను తెలియని వ్యాధితో మరణించాడని అంటున్నారు. ఒక ప్రకటన ప్రకారం ఈ కొత్త DNA అధ్యయనం అతను బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు చూపిస్తుంది.

వు చక్రవర్తి ఎలా కనిపించాడు ?

చక్రవర్తి జియాన్‌బీ అనే చిన్న సంచార సమూహం నుండి ఈయన వచ్చాడు. చక్రవర్తి సామ్రాజ్యం ఉనికిలో ఉన్న ప్రదేశం నేడు మంగోలియా, ఉత్తర, ఈశాన్య చైనా. వూ గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు, ముదురు రంగు కలిగి ఉన్నారని DNA నివేదిక నుండి పరిశోధకులు కనుగొన్నారు. మరికొంతమంది దట్టమైన గడ్డం, ఎత్తైన ముక్కు, పసుపు జుట్టుతో వు విదేశీగా కనిపించారని చెబుతారు. "వూ చక్రవర్తి ముఖ లక్షణాలు తూర్పు లేదా ఈశాన్య ఆసియా ప్రజల మాదిరిగానే ఉన్నాయని పరిశోధన చూపిస్తుందని" అని అధ్యయనంలో పాల్గొన్న షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ షావోకింగ్ వెన్ అన్నారు.

వు ముఖం గురించి ఎలా కనుగొన్నారు ?

పరిశోధన బృందం వు పుర్రెతో పాటు చాలా జన్యు సమాచారాన్ని ఉపయోగించింది. తర్వాత వారి సహకారంతో 3వ చిత్రాన్ని రూపొందించారు. అయినప్పటికీ అస్థిపంజర అవశేషాల నుండి చర్మం, జుట్టు, కళ్ళు రంగును ఊహించడం కష్టం.

Read More..

ఈ బ్లడ్ గ్రూప్‌ వారు చికెన్, మటన్ తింటున్నారా? తినేముందు ఇవి తెలుసుకోండి!


Next Story