మెటాలో మరోసారి లేఆఫ్స్.. భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపు!

by Disha Web Desk 2 |
మెటాలో మరోసారి లేఆఫ్స్.. భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌‌లో లేఆఫ్స్ భారీగా కొనసాగుతున్నాయి. తాజాగా తన సంస్థలోని మూడవ విడత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మెటా వేగవంతం చేసింది. మరో 6,000 మందిని ఇంటికి పంపిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా 10వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని ఏప్రిల్‌, మేలో రెండు విడతలుగా చేపడతామని వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఏప్రిల్‌లో 4000 మందిని తొలిగించింది.

మిగిలిన 6000 మందిని తాజాగా తొలగించింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటుచేసుకున్నాయి. తొలగింపుల్లో భాగంగా భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులనూ ఇంటికి పంపించింది. పింక్‌ స్లిప్స్‌ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్లు సమాచారం. మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్ అవినాశ్‌ పంత్‌, మీడియా పార్ట్‌నర్‌షిప్స్‌ డైరెక్టర్‌ సాకేత్‌ ఝా సౌరభ్‌ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇలా భారత్‌లో మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.


Next Story

Most Viewed