కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసిన బౌల్ట్.. ధర ఎంతంటే!

by Disha Web Desk 17 |
కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసిన బౌల్ట్.. ధర ఎంతంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: బౌల్ట్ కంపెనీ కొత్తగా స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘స్ట్రైకర్ ప్లస్’. దీని ధర రూ. 1,299. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ వాచ్ 1.39-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వచ్చింది. దీంతో వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేయవచ్చు, ఆన్సర్ చేయవచ్చు. వాచ్ బ్లాక్, బ్లూ, వైట్, ఎమరాల్డ్ అనే నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇది Siri, Google అసిస్టెంట్‌ వంటి AI వాయిస్ అసిస్టెంట్‌లకు సపోర్ట్ ఇస్తుంది.



స్ట్రైకర్ ప్లస్ స్మార్ట్‌వాచ్‌లో SpO2 సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ ట్రాకర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, స్లీప్ మానిటర్ ఉన్నాయి. క్రికెట్, రన్నింగ్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, యోగా, స్విమ్మింగ్‌తో సహా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. అదనంగా వాచ్‌లో అలారం, టైమర్, స్టాప్‌వాచ్, వాతావరణ సూచన, కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు మొదలగునవి ఉన్నాయి.



Next Story