సరికొత్త మైలురాయిని అందుకున్న boAt సంస్థ..

by Dishafeatures2 |
సరికొత్త మైలురాయిని అందుకున్న boAt సంస్థ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇయర్ ఫోన్స్, స్పీకర్ల తయారీ సంస్థ బోట్ (boAt) తన భారత మార్కెట్‌లో సరికొత్త మైలురాయిని అందుకుంది. బోట్ సంస్థ దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. రాక్ ఇన్ ఇండియా కాంపెయిన్‌లో ద్వారా భారత్‌లో 1 మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని సంస్థ సాధించిందని, సంస్థ ఇదో చాలా పెద్ద స్టెప్ అని సంస్థ యాజమాన్యం పేర్కొంది.

అయితే ఈ కాంపెయిన్ కోసం బోట్ సంస్థ మయూర్ జుమాని సంస్థతో జతకట్టి.. మేక్ అండ్ రాక్ ఇన్ ఇండియా పట్ల భారత అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ఫ్యాక్టరీ శబ్దాల సింఫనీని వినియోగించి ఓ కొత్త మ్యూజిక్‌ను తయారు చేసి విడుదల చేశామని బోట్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ కేటగిరీ సంస్థల్లో భారత్‌లో మేక్ ఇన్ ఇండియా కాంపెయిన్‌లో 1 మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అందుకున్న ఏకైక సంస్థ బోట్ అని సంస్థ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ కాంపెయిన్‌ను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : రెండు సార్లు టచ్ చేస్తే చాలు.. ఫొటోలు తీసే Oppo కొత్త ఇయర్‌బడ్స్ https


Next Story

Most Viewed