ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

by  |
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇంగ్లండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడుతుండగా.. చివరి ఐదో టీ20 శనివారం జరగనుంది. ప్రస్తుతం రెండు జట్టు తలా రెండు మ్యాచ్‌లు గెలవగా.. టీ20 సిరీస్‌ను డిసైడ్ చేసే చివరి మ్యాచ్ మరింత రసవత్తరంగా జరగనుంది. టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ను ఢీకొట్టి టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

టీ20 సిరీస్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), Y చహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, T నటరాజన్, భువనేశ్వర్ కుమార్, Md.సిరాజ్, ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్

Next Story