టీమిండియా టార్గెట్ 187

by  |
టీమిండియా టార్గెట్ 187
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-ఆసీస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న పొట్టి ఫార్మాట్‌ మూడో మ్యాచ్‌లో కంగారులు మంచి స్కోర్ నమోదు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు తీశారు. ఓపెనర్ మాథ్యూ వేడ్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 80 పరుగులు చేశాడు. ఇక ఆరోన్ ఫించ్ డకౌట్‌తో పెవిలియన్ చేరగా..స్టీవ్ స్మిత్ 24 పరుగులతో రాణించాడు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో (54) హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన హెన్రిక్స్(నాటౌట్) 7 పరుగులు చేసి క్రీజులో ఉండగా.. డి ఆర్సీ షార్ట్ 7 పరుగులకే ఔట్ అయ్యాడు. డానియల్ స్యామ్స్ 4 పరుగులు చేసేసరికి నిర్ణీత ఓవర్లు ముగిశాయి. దీంతో ఆసీస్ జట్టు 186 పరుగులు చేసింది. కాగా, టీ-20 సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధీక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed