హార్డ్ క్వారంటైన్‌లో చెమటోడుస్తున్న టీమిండియా

by  |
హార్డ్ క్వారంటైన్‌లో చెమటోడుస్తున్న టీమిండియా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రస్తుతం ముంబైలో కఠిన క్వారంటైన్‌లో ఉన్నారు. జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనున్న టీమ్ ఇండియా ఆ తర్వాత మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండటానికి ఈసీబీ ఒప్పుకున్నది. దీంతో ఇండియాలోనే పది రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉంటున్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఉన్న గ్రాండ్ హయత్‌లో ఉంటున్న క్రికెటర్లు అసలు తమ ఫ్లోర్స్ దాటి బయటకు రావడం లేదు. అయితే హోటల్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌లో పూర్తిగా కసరత్తులు చేస్తున్నారు. క్రికెటర్లు అందరూ చెమటోడుస్తూ ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాయామాలు చేస్తున్న వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ మాత్రమే కాకుండా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నది.


Next Story