Women Cricketers India : క్వారంటైన్‌లో చెమటోడుస్తున్న మహిళా క్రికెటర్లు

by  |
Women Cricketers India : క్వారంటైన్‌లో చెమటోడుస్తున్న మహిళా క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా క్రికెటర్లు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ మహిళా జట్టుతో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. అదే సమయంలో పురుషుల జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుండటంతో.. మహిళ, పురుష క్రికెటర్లు కలసి ఒకే విమానంలో ఇంగ్లాండ్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పురుష జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ముంబైలోని ఒక హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నది. కఠిన క్వారంటైన్‌లో హోటల్ దాటే వీలు లేకపోవడంతో అక్కడి జిమ్‌లో క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. బయోబబుల్‌లో ఉన్న ఈ జిమ్‌లో ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. టెస్ట్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఇతర క్రికెటర్లు షెఫాలీ వర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, ఎక్తా బిస్త్ తదితరులు బరువులు ఎత్తుతూ కష్టపడుతున్నారు. టీమ్ ఇండియా పురుషుల జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ మరో మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Next Story

Most Viewed