ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

by  |
ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌‌‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఓ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఒకే పాఠశాలలో 19 ఏళ్ల పాటు సేవలు అందించిన ఉపాధ్యాయుడు.. రిటైర్డ్ అయిన సందర్భంగా విద్యార్థులు ఊరంతా పల్లకిలో ఊరేగించారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చోడే వెంకటేశ్వరరావు శనివారం రిటైర్ అయ్యాడు. దీంతో ఆయన్ను ఘనంగా సత్కరించాలని భావించి విద్యార్థులు పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



Next Story