ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి- టీపీటీఎఫ్

by  |
tpt
X

దిశ, మహబూబాబాద్: రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంతోనే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని ఇలాంటి కీలక రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం హేయనీయమన్నారు. అంతర్ జిల్లా బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమ గోవర్ధన్, విష్ణు వర్ధన్, నాగేశ్వరరావు, కవిత, యోగనంధం, సైదుల్ పాషా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed