నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

by  |
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
X

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నేడు సమావేశం కానున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అందరితో ఒకే చోట సమావేశం ఏర్పాటు చేయకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ్యులతో మాట్లాడనున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన, విద్యుత్ చార్జీలు, మద్యం అమ్మకాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ మహానాడుపై కూడా పొలిట్‌బ్యూరో కీలకంగా చర్చించే అశాకాశం ఉందని సమాచారం.



Next Story

Most Viewed