పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తా

by  |
పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తా
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం కైకలూరు నియోజకవర్గంలో పర్యటించారు. గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో భారీగా పంటనష్టం జరిగింది. దీంతో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పోరాడి తగిన నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

అంతేగాకుండా బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. కాగా ఇవాళ కృష్ణాజిల్లాతో పాటు, పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో లోకేష్‌కు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.


Next Story