దానికి ఎవరు బాధ్యత వహిస్తారు

by  |
దానికి ఎవరు బాధ్యత వహిస్తారు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన దీపక్… పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ఈ ఘటనపై అనంతపురం డీఎస్పీ సహా ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రజలకు స్వాతంత్ర్యం ఉందా? అని ప్రశ్నించారు. భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా బ్రిటీష్ వారు విభజించినట్టు… జగన్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మొత్తం 100 శాతం ఓట్లు వైసీపీకే పడినట్టు ఆ పార్టీ భావిస్తోందని… వారికి 50 ఓట్లు వస్తే, టీడీపీకి 40 ఓట్లు వచ్చాయనే విషయాన్ని మర్చిపోకూడని దీపక్ రెడ్డి అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తికి… అమరావతి రైతుల ఆవేదన కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారిపై, చివరకు మీడియాపై కూడా దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story

Most Viewed