టీడీపీ ఎమ్మెల్యే ఆక్రమణలోని భూమి స్వాధీనం

by  |
టీడీపీ ఎమ్మెల్యే ఆక్రమణలోని భూమి స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో ప్రభుత్వ భూములు, అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం రుషికొండలోని సర్వే నెంబర్ 21లో ఉన్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిని ప్రభుత్వానికి చెందినదైనప్పటికీ.. ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అధీనంలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు.

కాగా, మరో వైపు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆక్రమణలోని 300 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమించిన భూమి విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed