- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 17 ఓట్లు మాత్రమే పడ్డాయి. రెబల్ ఎమ్మెల్యేలు కావాలని ఓట్లు తప్పుగా వేసినా… టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఓటు సాంకేతిక కారణాలతో చెల్లకపోవడం అందర్నీ షాక్కు గురి చేసింది. ఆమె పార్టీ మారనున్నారా? బాబాయి(అచ్చెన్నాయుడు)పై కేసుల దాడితో ఆమె పార్టీ మారనున్నారా? అంటూ ఊహాగానాలు రేగాయి. దీనిపై ఆమె వివరణ ఇస్తూ, రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని ‘టిక్ పెట్టవచ్చా?’ అని అడిగితే వారు ‘ఓకే’ చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని భవాని వెల్లడించారు. దీంతో పార్టీ మారుతున్నట్టు వచ్చిన ఊహాగానాలకు చెక్ పడింది.