- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ పిలుపు మేరకు ‘నా ఇల్లు నా సొంతం’ ఉద్యమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మహా పాదయాత్ర మొదలైంది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర ప్రారంభం కాగా పాలకొల్లు నుంచి నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ఏడాదిన్నర పాటు ఇళ్ళు ఆలస్యం చేసినందుకు లబ్ధిదారులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో ఇళ్ళు నిర్మిస్తే, నేడు జగన్ సూట్ కేసు కంపెనీలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరు చెప్పి జరిగిన రూ.4వేల కోట్ల అవినీతిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
Next Story