TDP Mahanadu: టీడీపీ మహానాడుపై చంద్రబాబు కీలక ప్రకటన

by  |
chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా డిజిటల్ వేదికగా మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో వెల్లడించారు. మే 27,28వ తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు జరుగుతుందని, వైసీపీ రెండేళ్ల పాలన, అప్పులు, స్కాములు, తదితర అంశాలపై తీర్మానం చేయనున్నామన్నారు.

అందరూ కలిసి వచ్చి డిజిటల్ మహానాడుని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో గత సంవత్సరంలాగే.. ఈ సంవత్సరం కూడా వర్చువల్ ద్వారా మహానాడు నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed