రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ నిరసన

by  |
రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ నిరసన
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు సచివాలయం సమీపంలో నిరసన తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. పంట కంకులతో కూడిన బ్యానర్లను టీడీపీ నేతలు ప్రదర్శించారు. ఏపీలో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.


Next Story