ఏ ఒక్కరిని వదిలి పెట్టం: ఎంపీ విజయసాయిరెడ్డి

by  |
ఏ ఒక్కరిని వదిలి పెట్టం: ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో టీడీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుంటామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొందరు రెవెన్యూ అధికారులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, రికార్డులను తారుమారు చేశారని పేర్కొన్నారు. భూములను స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడుతామన్న ఎంపీ విజయసాయిరెడ్డి… అవసరమైతే అరెస్ట్‌లు చేసేందుకు కూడా వెనుకాడమని తేల్చి చెప్పారు. విశాఖలోని ప్రభుత్వ భూముల్లోనే రాజధానిని ఏర్పాటు చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Next Story